Thursday, April 25, 2024
- Advertisement -

బెంగులూరులో మొద‌లైన ప్రేమ క‌థ చెన్నైలో ముగింపు… ట్విస్ట్ తెలిస్తే షాక్‌

- Advertisement -

ప్రేమ ఎక్క‌డ మొద‌ల‌వుతుందో…ఎక్క‌డ ముగుస్తుందో ఎవ్వ‌రికి తెలియ‌దు. సినిమాల్లో ఒక వూరిలో మొద‌లైన ప్రేమ‌క‌థ అనేక మ‌లుపులు తిరిగి మ‌రో ఊరులో ఎండ్ అవుతుంది. అచ్చం అలాంటి ప్రేమ‌క‌థే నిజ‌జీవితంలో జ‌రిగింది. పెళ్లయిన యువతితో ప్రేమ కథ ఇది. బెంగళూరులో మొదలై చెన్నైలో తేలింది.

చెన్నై వానియంబాడికి చెందిన మహ్మమద్‌ బిలాల్‌ (21) బెంగళూరులో శివాజీనగర్‌లోని ఒక బట్టల షాపులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. అక్కడే తలాసుం (19) అనే యువతి షాపింగ్‌ కోసం తరచూ అదే దుకాణానికి రావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమ‌కు దారి తీసింది.

బెంగళూరులో కలిసుంటే పెద్దలు అడ్డు పడతారన్న ఆలోచనలో, ఇద్దరూ కలసి గత బుధవారం రాత్రి చెన్నైకి చెక్కేశారు. ఆపై చెన్నైలో పెద్ద హైడ్రామాయే నడిచింది. యువతి తల్లిదండ్రులు బెంగళూరు పోలీసులను ఆశ్రయించగా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేసిన పోలీసులు వారు చెన్నైలో ఉన్నారని తేల్చారు. దీంతో చెన్నైకి చేరుకున్న యువతి తల్లిదండ్రులు ప్రేమజంటను కలిసి బిలాల్ పై దాడికి దిగారు. బిలాల్ కూడా తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు.

పెళ్లికాని అమ్మాయిని ప్రేమిస్తే తప్పులేదు, మరొకరి పెళ్లాన్ని ప్రేమిస్తేనే తప్పని వారు చెప్పడంతో బిలాల్‌ కంగుతిన్నాడు. నీకు పెళ్లయిందా అని ప్రియురాలిని అడగ్గా, సిగ్గుపడుతూ తలదించుకోగా, బిడ్డ కూడా ఉందని ఆమె బంధువులు చెప్పడంతో బిలాల్‌ కుప్పకూలిపోయాడు.బిలాల్‌ అరెస్ట్‌చేసి బెంగళూరుకు తీసుకెళ్లగా, చెన్నైలో అతడికి సహకరించిన స్నేహితుడు వవుసాన్‌లపై చెన్నై పోలీసులు వేరుగా కిడ్నాప్‌ కేసు పెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -