‘మేఘా గ్యాస్’ బ్రాండ్ పేరుతో మేఘా ఇంజినీరింగ్ – గ్యాస్ పంపిణీ వ్యవస్థను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ను పంపిణీ చేసేందుకు ఎంఇఐఎల్ హైడ్రోకార్బన్స్ డివిజన్ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 16 జిల్లాల్లో గ్యాస్ పంపిణీ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతులను పొందింది. ఆటోమోబైల్ రంగానికి గ్యాస్ సరఫరా కోసం ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభంచిన మరో ఐదింటిని వచ్చే మూడు నెలల్లో ప్రారంభించనుంది. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపొందించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలను సాకారం చేసేందుకు మేఘా గ్యాస్ కృతనిశ్చయంతో ఉంది. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన ఇంధనాన్ని సరఫరా చేయడంతో పాటు, తమకు కేటాయించిన ప్రాంతాలో పర్యవరణం కాలుష్యం కాకుండా ఉండే బాధ్యతను కూడా మేఘా గ్యాస్ నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా, కర్ణాటకలోని తుంకూరు, బెల్గాం జిల్లాల్లో గ్యాస్ పంపిణీని ప్రారంభించింది.
వ్యూహాత్మకంగా నాగాయలంక, వెస్ట్ పెనుగొండ గ్యాస్ క్షేత్రాలను
ఇప్పటికే వినియోగదారులకు గ్యాస్ చేరవేసేందుకు ‘మేఘా గ్యాస్’1200 కిలోమీటర్ల పైప్లైన్ను వేసింది. సమీప భవిష్యత్లో మరో 5,000 కిలోమీటర్ల పైప్లైన్ను మూడు రాష్ట్రాల్లో వేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్యాస్ గ్రిడ్ను అభివృద్ధి పరిచేందుకు గాను ఓఎన్జీసీ నుంచి నాగాయలంక, వెస్ట్ పెనుగొండ ఆన్షోర్ గ్యాస్ క్షేత్రాలను వ్యూహాత్మకంగా పొందింది. ఈ గ్యాస్ క్షేత్రాల నుంచి రోజుకి లక్షా 30 వేల ఎస్సీఎం గ్యాస్ను తరలించనుంది. ఇందుకోసం అమెరికా నుంచి రప్పించిన మెకానికల్ రిఫ్రిజేషన్ యూనిట్లు, కంప్రెసర్లు ఇతర మెకానికల్ ప్యాకేజీను వినియోగిస్తున్నది. ఇప్పటికే నాగాయలంక క్షేత్రం నుంచి నేచురల్గ్యాస్ను ఆంధ్రప్రదేశ్లోని క్రిష్టాజిల్లాలోని వినియోగదారులకు పంపిణీ చేస్తున్నది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ద్వారా వివిధ వనరుల నుంచి రోజుకి 40 వేల ఎస్సీఎం (స్టాండర్డ్ క్కుబిక్ మీటర్ ) నేచురల్ గ్యాస్ను సమీకరిస్తున్నది.
తెలుగులోగిళ్లలో:
ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లాలో విస్తృతంగా పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ పంపిణీ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న 9 సీఎన్జీ స్టేషన్ల ద్వారా ప్రతి నెలా నాలుగున్నర లక్షల ఎన్ సీఎం గ్యాస్ను విక్రయిస్తున్నది. కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఐదు సీఎన్జీ స్టేషన్ల ద్వారా మరో మూడు లక్షల ఎన్ సీఎం గ్యాస్ ను సరఫరా చేసే అవకాశం వుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 13 వేల మంది గృహ వినియోగదారులకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ను పంపిణీ చేస్తున్నది. ఈ నెలాఖరులో మరో రెండు వేల మంది వినియోగదారులకు పీఎన్జీ ని పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వాణిజ్య వినియోగదారులకు ప్రతినెలా 60 వేల ఎస్సీఎం గ్యాస్ను పంపిణీ చేస్తున్నది. త్వరలో మరో పది వాణిజ్య వినియోగదారులకు ప్రతినెలా లక్ష ఎస్సీఎం గ్యాస్ను సరఫరా చేసేందుకు రంగం సిద్ధం అయింది.
తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి త్వరలో గ్యాస్ పంపిణీకి సన్నహాలను చేస్తున్నది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో 12 కిలోమీటర్ల మేర పైపులైను వేయగా వచ్చే మూడు నెలల్లో మిగతా జిల్లాల్లో పైప్లైను పనులను విస్తరించి సేవలను ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నది.
కర్ణాటకలో …
పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ ను పొందేందుకు కర్ణాటకలోని బెల్గాం, తుంకూర్ జిల్లా గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ఈ రెండు జిల్లాల్లో అంచనాకు మించిన డిమాండ్ వస్తున్నది. ఒక్క తుంకూర్ జిల్లాలోనే మొత్తం 12,500 మంది వినియోగదారులకు ప్రస్తుతం పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తుండగా, ఈ నెలాఖారుకు మరో నాలుగు వేల గ్యాస్ కనెక్షన్లను ఇవ్వనుంది. వాణిజ్య వినియోగదారుల నుంచి ప్రతి నెలా లక్షా 40 వేల ఎస్సీఎం గ్యాస్ను పంపిణీ చేస్తుండగా, త్వరలోనే ఈ డిమాండ్ రెట్టింపు కానుంది. బెల్గాం జిల్లాలో ఇప్పటికే 15 వేల మంది వినియోగదారులకు పీఎన్జీని సరఫరా చేస్తుండగా త్వరలో మరో 2500 వేల మందికి సరఫరా చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఈ జిల్లాలో వాణిజ్య వినియోగదారులకు సరఫరా చేస్తున్న గ్యాస్ నెలకు 2,10,000 ఎస్సీఎం కు చేరుకుంది. సమీప భవిష్యత్లో మరో మూడు లక్షల ఎస్సీఎం గ్యాస్ సరఫరాకు అవకాశం వుంది. ఈ రెండు జిల్లాల్లో నాలుగు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సన్నాహం చేస్తున్నది. పరిశ్రమల్లో నేచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకుగాను, పరిశ్రమల కోసం ప్రత్యేక ప్రణాళికను ‘మేఘా గ్యాస్’ రూపొందించింది. అతి తక్కువ పెట్టుబడి అవసరమయ్యే ఆకర్షణీయ ప్యాకేజీతో పథకాలను సిద్ధం చేసింది. పెట్టే పెట్డుబడిని తర్వాతి కాలంలో డిప్రిసియేషేన్ రూపంలో తిరిగి పొందే విధంగా ఈ ప్రణాళికలు ఉండడంతో, పరిశ్రమలు గ్యాస్ వినియోగానికి ఆసక్తి చూపుతున్నాయి.