Friday, April 19, 2024
- Advertisement -

మంత్రి జయరాం జైలుకి వెళ్లక తప్పదా..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ని జగన్ ఇప్పటికే వెలికి తీసే ప్రయత్నంలో జగన్ ఉన్నారు.. ఆ క్రమంలోనే కొంతమంది ఎలుకల్ని జైలుకి పంపాడు.. వారు కూడా అవినీతి ఆరోపణల్లో నిజం నిర్ధారణ అవడంతో సైలెంట్ గా ఉండక తప్పట్లేదు.. ప్రతిపక్ష పార్టీ లో అవినీతికి పాల్పడ్డ వారిపై జులుం విప్పుతూ వారిని జైలుకి పంపిస్తూ ప్రజలకు అవినీతి లేని సామ్రాజ్యాన్ని సృష్టించే పనిలో ఉన్న జగన్ కు సొంత పార్టీ నేత అవినీతి కోరల్లో చిక్కుకోవడం ఇప్పుడు సమస్యగా మారింది.. అయితే ఇప్పటివరకు ఇవి ఆరోపణలే అయినా రుజువైతే ఏంటి పరిస్థితి అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

జగన్ ఆ నేత ను ప్రతిపక్ష నేతలను పంపినట్లు జైలుకి పంపుతాడా.. చంద్రబాబు చేసినట్లు వెనుకోసుకొస్తారా అన్నది చూడాల్సి వుంది.. తాజాగా కర్నూలు జిల్లా ఆస్పరిలో మంత్రి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన వందల ఎకరాల భూముల వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే దిసగా మార్చేస్తున్నారు. ఇట్టినా కంపెనీ తనకు భూముల్ని అమ్మింది నిజమేనని.. కానీ ఇప్పుడు అమ్మలేదంటున్నారని.. మంత్రి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏమిటటంటే.. మంజునాథ్ అనే వ్యక్తి దగ్గర మంత్రి జయరాం కుటుంబసభ్యులు ఆ భూములు కొనుగోలు చేశారు.

ఈ మంజునాత్ ఒకప్పుడు ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీలో ఉన్నారు. ఆ తర్వాత విరమించుకున్నారు. అయితే.. ఆయన ఇట్టినా ప్లాంటేషన్ బోర్డు.. తనకు ఆ భూముల్ని అమ్మే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందంటూ ఓ పత్రం తీసుకు వచ్చి.. ఆ కంపెనీకి చెందిన భూముల్ని మంత్రి కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్టర్ చేసేశారు. మంత్రిగారే కొనుక్కుంటున్నారు కాబట్టి.. ముందూ వెనుకా ఆలోచించకుండా… అధికారులు రిజిస్టర్ చేసేశారు. అయితే ఇప్పుడు ఆయన భూములు కొన్న వ్యవహారం బయటకు రావడంతో .. మొత్తం మ్యాటర్ అంతా రివర్స్ అయింది. ఇందులో భారీ కుంభకోణం జరిగిందని అంటున్నారు.. దీనికి కౌంటర్ ఇవ్వడానికి జయరాం తంటాలు పడుతున్నారు. నకిలీ డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేశారా, లేదా బెదిరించి భూముల్ని సొంతం చేసుకున్నారా అనేది దర్యాప్తు లో తేలనుంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -