Friday, April 26, 2024
- Advertisement -

మైన‌ర్ బాలిక‌ను త‌ల్లిని చేసిన తాత‌… మ‌న‌స్థాపంతో ఆత్మ‌హ‌త్య‌

- Advertisement -

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎవ‌రిని న‌మ్మాలో ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో లాంటి భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితులు కొనసాగుతున్నాయి. ప‌రాయి వాల్లకంటె సొంత వాల్లే మ‌హిళ‌లు, మైన‌ర్ బాలిక‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. వ‌రుస‌కు తాత అయ్యే వ్య‌క్తి మైన‌ర్ బాలిక‌ను త‌ల్లిని చేశాడు. చుట్టం చూపుగా ఇంటికి వ‌చ్చి బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి బాలిక‌ను లోబ‌ర్చుకున్నాడు. దీంతో పంచాయితీ పెట్టిన పెద్ద‌లు పరిహారంగా రూ.లక్షన్నర చెల్లించాలని ఆదేశించారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌యిన బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దారుణ‌మైన సంఘ‌ట‌న హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

వివ‌రాల్లోకి వెల్తే….మీర్‌పేట ప్రశాంతినగర్‌కు చెందిన మొగులయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2008లో భార్య చ‌నిపోవ‌డంతో మిర్యాలగూడకు చెందిన దుర్గమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. దుర్గమ్మ చెల్లెలు నాగమ్మ కూడా వారి కాలనీలోనే నివాసముంటోంది. మిర్యాలగూడలో ఉండే వారి మేనమామ మల్లేష్‌ తరచూ నాగమ్మ, దుర్గమ్మల ఇళ్లకు వస్తుండేవాడు. ఈ స‌మ‌యంలో మొగ‌ల‌య్య‌కూతురిపై మ‌ల్లేష్ క‌న్నుప‌డింది. ఇంకేముంది మాయ‌మాట‌లు చెప్పి లోబ‌రుచుకున్నాడు. నెల రోజుల క్రితం క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతున్న బాలిక‌ను త‌ల్లిదండ్రులు ఆసుప‌త్రికి తీసుకెల్ల చూపించ‌డంతో ప‌రీక్షించిన డాక్ట‌ర్లు గ‌ర్భ‌వ‌తి అని చెప్ప‌డంతో మిర్యాలగూడకు వెళ్లి ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. మల్లేష్‌ను నష్టపరిహారంగా రూ.లక్షన్నర చెల్లించాలని పెద్దలు సూచించారు. దీంతో మ‌న‌స్థాపాం చెందిన బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. నింద‌తుడు మ‌ల్లేష్ ప‌రారీలో ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -