కరోనా కేసులు రోజు రోజుకి విపరితంగా పేరుగుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. కేసులు పెరుగుతున వేళ ప్రధాని నరేంద్రమోడీ మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కరోనా వైరస్ కోసం భారత్ గట్టిగా పోరాడుతుందని మోడీ అన్నారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ ఆయ్యాయి. లాక్ డౌన్ తోపాటు ఇతర చర్యల మూలంగా కరోనా దేశంలో నియంత్రణలోనే ఉందని.. ఇతర ప్రపంచ దేశాల కంటే భారత్ కట్టడిలో ముందున్నామని మోడీ అన్నారు. శనివారం రెవరండ్ జోసెఫ్ మార్ తోనా 90వ జయంతి సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు.
దేశంలో కరోనా రోగుల రికవరీ రోజు రోజుకి పెరుగుతుందని.. ఇటలీ కంటే మన దేశంలో కరోనా మరణాలు రేటు తక్కువగా ఉందని అన్నారు. ఇక మాకు రాజ్యాంగమే మార్గదర్శి అని.. వన్ నేషన్ వన్ రేషన్ కార్డుతో పేదలకు బియ్యం ఎక్కడున్నా అందజేస్తున్నామని మోడీ అన్నారు. జన్ ధన్ ఖాతాల్లో నగదు జమ చేశామని.. మధ్య తరగతి ప్రజల ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ కోసం చర్యలు చేపట్టామన్నారు.
పోల‘వరం’: కలలప్రాజెక్ట్ పూర్తికి శ్రమిస్తున్న మేఘా
బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు