శ్రీకాకులం జిల్లాలో దారుణమైన సంఘలన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అత్తాకోడళ్ల ను కిరాతకంగా హత్య చేసి మృత దేహాలను ముక్కలుగా నరికి చెల్లా చెదరుగా పడేయడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది జిల్లా. వివరాల్లోకి వెల్తే…నగరంలోని బొందిలీపురంలో నివసించే అబ్దుల్ ఖుదీష్ జిలానీ అనే వ్యక్తి తల్లి, భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అతను చెప్పుల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
మెహరున్నీషా భర్త అబ్దుల్ ఖుదీష్ జిలానీ వ్యాపార నిమిత్తం బయటకెళ్లడం.. పిల్లలు స్కూల్కు వెళ్లడంతో.. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరే ఉన్నారు. స్కూల్కు వెళ్లిన పిల్లలు సాయంత్రం ఇంటికొచ్చే సరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇదే విషయాన్ని పిల్లలు తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. జిలానీ.. ఇంటికి వచ్చి మరో కీతో తాళం తీసి చూడగా.. భార్య, తల్లి విగత జీవులై కనిపించారు. ఇద్దరిని హత్య చేసి ఇంటికి తాళం వేసి వెల్లడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మరో వైపు తన తల్లి, భార్యను హత్య చేయడంతోపాటు ఇంట్లోని దాదాపు రూ.4లక్షల నగదు ను అపహరించుకపోయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.