విశాఖ పట్నం జిల్లాలో ఒల్లు గగ్గరు పొడిచె సంఘటన చోటు చేసుకుంది. పెద బయలు మండలం లకేయుపుట్టులో ఆరేళ్ల బాలిక కొర్ర అనితను మేనత్త దారుణంగా హతమా ర్చింది. మేనత్త వంతాల రస్మో కట్టెల కోసం వెళ్దామని చిన్నారిని కొండపైకి తీసుకెళ్లింది. కొండపై చిన్నారిని నరికి చంపి రక్తం తాగినట్లు గ్రామస్తులు చెప్పినట్లు సమాచారం.. ఈ సంఘటన ఏజెన్సీలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెల్తే….నిందితురాలు లక్ష్మీపేట పంచాయతీ కప్పాడు గ్రామానికి చెందిన వంతాల రస్మో గత నెల రోజుల నుంచి తమ్ముడి ఇంట్లో ఉంటోంది. అయితే రస్మోకు మద్యం తాగె అలవాటుందని గ్రామస్తులు చెబుతున్నారు. గతకొంతకాలంగా ఆమెను తన భర్త దగ్గరకు వెళ్లిపోవాలని నాలుగు రోజుల కిందట తమ్ముడి భార్య చెప్పింది. అయితే దీంతో ఆగ్రహించిన రస్మో పాపను చంపుతానని హెచ్చరించింది.
మంగళవారం నాడు కట్టెల కోసం చిన్నారిని తనతో పాటు తీసుకెళ్లిన రస్మో కత్తితో బలంగా మెడపై నరికింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు సమాచారం తెలుసుకొని వెళ్లగా.. అప్పటికే బాలిక మృతి చెందింది. నిందితురాలిని పట్టుకొని గ్రామస్థులు దేహ శుద్ది చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.