మధ్యప్రదేశ్లో జరుగుతున్న గణేశ్ నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది.భోపాల్లోని ఖట్లాపూర్లోని ఘాట్ వద్ద శుక్రవారం ఉదయం గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సమయంలో బోటు బోల్తా పడిన ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. ఐదుగురు గల్లంతయ్యారు.భోపాల్ ఐజీ యోగేష్ దేశ్ముఖ్ అందించిన సమాచారం ప్రకారం పడవలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో 11మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని వారి కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ సిద్ధంగా ఉన్న రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. బోటులో పరిమితికి మించి ఎక్కడం వల్లే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీరి ఆచూకీ కోసం గత ఈతగాళ్లు శ్రమిస్తున్నారు. ఎస్డిఇఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ విషాదంపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఈ ఘటన జరగడం బాధాకరమని మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.4లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.