వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలై టోర్నీ నుంచి నిష్క్రమించడంతో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సెమీఫైనల్లో ఓడిపోవడం కంటె ధోని రిటైర్మెంటే ఆసక్తిగా మారింది. ముఖ్యంగా లండన్ వరల్డ్ కప్ తరువాత ఆయన తన ఆటకు స్వస్తి చెబుతారని వార్తలు వచ్చినా, వాటిని ధోనీ కొట్టిపారేశాడు. మరో వైపు మాజీ క్రికెటర్లు ధోని ఇక రిటైర్మెంట్ తీసుకుంటె మంచిదనె అభిప్రాయపడా……మరి కొందరు మాత్రం ధోనికి మద్దతుగా మాట్లాడుతున్నారు. జులై మూడు నుంచి జరిగే విండీస్ టూర్ కు ధోనీ ఎంపికవుతాడా లేదా అన్నది అనుమానాస్పదంగా మారింది.
ఇదలా ఉంటె ధోని రిటైర్మెంట్పై తల్లి, దండ్రులు స్పందించారు. ధోనీ ఆటకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నారంట.ఈ విషయాన్ని ధోనీ పర్సనల్ కోచ్ కేశవ్ బెనర్జీ స్వయంగా చెప్పారు. ధోనీ క్రికెట్ కు గుడ్బై చెప్పాలని అయన తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను వారింటికి వెళ్లి మాట్లాడానని, ఇక క్రికెట్ ను విడిచి, తమతో పాటు ఇంట్లో ఉండాలని వారు భావిస్తున్నారని అన్నారు