మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒకచోట మహిలలపై అత్యాచారాలు, హత్యలు జరుగూతూనె ఉన్నాయి. చిన్న పిల్లలు అని చూడకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. అలాంటి సంఘటన మరొకటి చోటచేసుకుంది. హైచ్ఐవి ఉందని ఎంత వేడుకున్నా ఆ కామాంధుడు కనికరించకుండా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడో నీచుడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెల్తే….కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న తన సోదరికి సహాయంగా ఆస్పత్రిలో ఉంటోంది ఓ మహిళ. తను హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతున్నా.. తన సోదరికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఆస్పత్రికి వచ్చారు. ఆమెపై కన్నేశాడో యువకుడు. ఆమెతో మాటలు కలిపిన నిందితుడు తాను అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాని చెప్పి నమ్మించాడు. కష్టాల్లో ఉన్నానని చెప్పడంతో … ఆస్పత్రిలో పైఅంతస్తులో ఉన్న డిపార్ట్మెంట్లో ఫామ్ నింపితే మందులు, చికిత్సలో రాయితీ ఇస్తారని నమ్మించిన నిందితుడు… ఆమెను డాబాపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. హైచ్ఐవి ఉందని వేడుకున్నా పశువులా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన వెంటనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో సీసీ పుటేజ్ని పరిశీలించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.