సమాజంలో అక్ర సంబంధాలకు అడ్డూ అదుపూ లేకుండో పోతోంది. మేజర్లు, మైనర్లు అనే తేడా లేకుండా అక్రమసంబంధాలు పెట్టుకుంటున్నారు. చివరకు కటకటాల పాలవుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆంటీ ఓ మైనర్ను పెళ్లాడి చివరకు బిడ్డ, ఆంటీ ఇద్దరూ కటకటాల పాలయ్యారు.దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ సంఘటన ముంబై నగరంలో జరిగింది
ఓ మహిళకు అప్పటికే పెళ్లి అయ్యింది. కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయింది. ఆ తర్వాత.. మాయ మాటలు చెప్పి.. 17ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకొని.. అతనితో ఒక బిడ్డను కూడా కనేసింది. ఆ బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
ముంబయికి చెందిన ఓ మహిళ(23) వాళ్ల ఇంటికి సమీపంలో ఉండే ఓ మైనర్ కుర్రాడిని వలలో వేసుకుంది. ఆమె మోజులో పడిన సదరు బాలుడు… ఆంటీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం అతని ఇంట్లో తెలియడంతో బాలుడి తల్లిదండ్రులు ఆమె మందలించారు.
దీంతో ఏం చేయాలో తెలియక ఆమెతో మాట్లాడవద్దని బాలుడిని మందలించారు అతని తల్లిదండ్రులు, సోదరుడు. అయితే ఆ రోజు రాత్రి ఆంటీని తీసుకుని పారిపోయాడు ఆ కుర్రాడు. ఇద్దరూ నవంబర్ 8, 2017న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కలిసి తల్లిదండ్రుల ఇంటి పక్కనే కాపురం పెట్టారా ఇద్దరు.
వాళ్ల ఇంట్లో వాళ్లకు తెలీకుండా పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు.. యువతిని నిలదీశారు. కాగా.. తమకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని.. కాదని మీ అబ్బాయిని తీసుకొని వెళతాను అంటే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
దీంతో కాస్త వెనక్కి తగ్గిన బాలుడి తల్లి దండ్రలు ..తమ కుమారుడిని ఆ మహిళ వశపరుచుకుందని.. ఆమె కారణంగా తమ కుమారుడు పదో తరగతి కూడా ఫెయిల్ అయ్యాడని బాలుడి తల్లి ఆరోపిస్తోంది. మ కొడుకుని పంపించాలని ఆమె ఇంటికి వెళ్లి అడిగితే… విషం తాగుతానని బెదిరిస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళను అరెస్టు చేశారు. పోస్కో చట్టం, లైంగిక వేధింపులు, బాల్య వివాహం తదితర చట్టాల కింద ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అయితే బాలుడితో కాపురం కారణంగా వారికి ఓ ఐదు నెలల కూతురు ఉండడంతో ఆ చిన్నారిని చూసుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.