Friday, March 29, 2024
- Advertisement -

అధిక సంతానం వద్దే అన్నాడు…అంతే కత్తితే 11 సార్లు పొడిచి చంపిన భార్య

- Advertisement -

అధిక సంతానం వల్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు ప్రభుత్వాలు కూడా జినాభా నియంత్రణపై అవగాహన తీసుకొస్తున్నా ఎక్కువ మంది దంపతులు అధిక సంతానానికే మొగ్గు చూపుతున్నారు. ముడో సంతానం భర్త వద్దన్నాడు అంతే…..ఇంకేముంది భార్య కత్తి తీసుకొని 11 పోట్లు పొడిచి హత్య చేసింది. ఈ సంఘటన ముంబయ్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెల్తే….భర్త, ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా గడుపుతున్న జీవితం భార్యకు నచ్చలేదు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లు ఉండగా మూడో సంతానంగా కొడుకు కావాలనుకుంది. ఈ విషయం భర్తకు చెప్పింది. మూడో సంతానం అవసరమా అన్నాడు అంతే..అక్కడే ఉన్న కత్తి తీసుకొని హత్య చేసింది.

ముంబయిలోని నలసోపార ప్రాంతానికి చెందిన సునీల్ అనే వ్యక్తికి(36) భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మగబిడ్డ కావాలన్న ఆలోచన భార్యకు వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ఇప్టికే కుటుంబ పరిస్థితులు బాగోలేవని మూడో సంతానం వస్తేపోషించడం కష్టమవుతుందని చెప్పి ఆ ఆలోచనను విమరించుకోమన్నారు. అంతే పట్టరాన కోపంతో బుధవారం ఉదయం కిచెన్‌లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి భర్తను విచక్షణా రహితంగా 11సార్లు పొడిచింది. తీవ్ర రక్తస్రావంతో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొదట భార్యను అదుపులోకి తీసుకొని విచారించినా ఆమె అసలు నిజాలు చెప్పలేదు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో నిజం ఒప్పుకుంది.మూడో బిడ్డ వద్దన్న కారణంతోనే ఆమె భర్తను చంపిందని తెలిసి పోలీసులు షాకయ్యారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -