Thursday, April 25, 2024
- Advertisement -

హైద‌రాబాద్‌లో దారుణం…..అంద‌రూ చూస్తుండ‌గానే

- Advertisement -

రాష్ట్ర రాజధాని హైదరాబదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.అందరూ చూస్తుండగా కత్తితో 30 ఏళ్ల వ్యక్తిని దుండగుడు నరికి చంపాడు. గత నెలలో అత్తపూర్ లో నడి రోడ్డుపై ఓ వ్యక్తిని నరికి చంపిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

రోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే కత్తితో 30 ఏళ్ల వ్యక్తిని దుండగుడు నరికి చంపాడు. దాంతో షకీర్ ఖురేషీ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. హైదరాబాద్ నయాపూల్ చౌరస్తాలో నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఓ యువకుడు మరో వ్యక్తి ప్రాణం తీశాడు. కత్తితో గొంతుకోసం దారుణంగా చంపేశాడు.

నడిరోడ్డుపై ఓ వ్యక్తిని నరికి చంపుతున్నా కూడా అడ్డుకునేందుకు పోలీసులు కూడా ముందుకు రాలేదు. తన చెల్లెపై అత్యాచారం చేసి ఆమెను చంపుతానని బయపెట్టినందుకు ఖురేషీని చంపినట్లు అబ్దుల్ చెబుతున్నాడు.మృతుడు షకీర్ ఖురేషీ ఆటో రిక్షా డ్రైవర్. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు ఖాజాను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -