Friday, April 19, 2024
- Advertisement -

Flash … Flash…రిజల్ట్‌కి ముందే బాబుకు దిమ్మతిరిగే షాక్

- Advertisement -

దేవుడా……………వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నప్పుడు కూడా ఎన్టీఆర్ ఇన్ని కష్టాలు పడలేదేమో. కానీ ఇప్పుడు చంద్రబాబుకు మాత్రం అంతకంటే ఎక్కువ కష్టాలే దాపురిస్తున్నాయి. ఎంతోమంది నాయకులకు చుక్కలు చూపించి, వాళ్ళ రాజకీయ జీవితాలకే శుభం కార్డ్ పలికిన బాబుకు ఇప్పుడు అంతకంటే హై రేంజ్ చుక్కల్నే మోడీ చూపెడుతున్నాడు. అందరూ కూడా జగన్‌కి ఫేవర్ చెయ్యడం కోసం మోడీ ఇదంతా చేస్తున్నాడు అని అనుకోవాలని బాబు తాపత్రయపడుతున్నాడు. కానీ అసలు విషయంలో ఏంటంటే మోడీని అరెస్ట్ చేయిస్తా అని గోద్రా సమయంలో బాబు అన్న మాటలను మోడీ మర్చిపోక ముందే 2014 ఎన్నికల్లో మోడీ ఇమేజ్ వాడుకుని గెలిచి, ఆ తర్వాత 2019 ఎన్నికల నాటికి తన రాజకీయ స్వార్థం కోసం మోడీని విలన్‌ని చేశాడు బాబు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మోడీ వ్యతిరేక నాయకులందరినీ కలుస్తున్నాడు. అందుకే ఇప్పుడు మోడీకూడా చంద్రబాబును చాలా సీరియస్‌గా తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వేదికగా మోడీ రివేంజ్ ఎలా ఉండబోతోంది అన్నదానికి సంబంధించి చాలా వార్తలే అధికారికంగా కూడా వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఎపిలో రాష్ట్రపతి పాలన విధిస్తారు అని చెప్తున్నారు. న్యాయశాఖకు ప్రతిపాదనలు పంపుతున్నారట. అక్కడ ఒకే అయితే రాష్ట్రపతి పాలన విధిస్తారట. ఆ వెంటనే రాజధాని భూముల అక్రమాలతో సహా అన్ని అవినీతి వ్యవహారాలకు సంబంధించిన అరెస్టులు ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఐదేళ్ళలో అప్పులుగా తెచ్చిన లక్షల కోట్లు ఏమయ్యాయి? ఎవరు తిన్నారు అనేదానికి సంబంధించి విచారణ జరుపుతారట. ఇదంతా ఎపిపైన దాడి అని బాబు బ్యాచ్ అంతా గగ్గోలు పెట్టడం ఖాయం. కానీ సామాన్య ప్రజలు మాత్రం అక్రమ సొమ్ములు, అవినీతి సొమ్ములు కక్కిస్తే మంచిదే కదా అని అభిప్రాయపడుతున్నారు. ముందు ముందు ఎపి వేదికగా ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో…………ఏ రేంజ్‌లో చంద్రబాబుకు షాకులు ఉంటాయో చూడాలని విశ్లేషకులు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -