Saturday, April 20, 2024
- Advertisement -

మరో బీజేపీ సీనియర్ సీరియస్.. మోడీ అప్ సెట్

- Advertisement -

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆనందంతో సంస్కరణల బాట పట్టిన మోడీకి సీనియర్లు దూరమవుతుండడం కలిచివేస్తోందట.. మొన్నటికి మొన్న బీజేపీ అగ్రనాయకురాలు సుష్మ స్వరాజ్ మరణిస్తే మోడీ కన్నీల్లు పెట్టుకున్నారు. ఇక బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఆసుపత్రిలో చేరడం బీజేపీ శిభిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

తాజాగా మరో ఆందోళనకర విషయం చోటుచేసుకుంది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ అగ్రగణ్యుడు అయిన అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇటీవలే ఆయన రెండు కిడ్నాలు పాడైపోతే కిడ్నా ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అస్వస్థతకు గురవుతున్నారు.

అందుకే ఈసారి మోడీ కేబినెట్ లో కూడా ఈ రోగాల వల్ల చేరలేకపోయారు. తాజాగా ఈనెల 9న అనారోగ్యంతో జైట్లీని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. ప్రత్యేక వైద్య బృందం జైట్లీకి చికిత్స చేస్తోంది.

చికిత్స తర్వాత కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించారు. కానీ శుక్రవారం ఉదయం జైట్లీ ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది.

జైట్లీ ఆరోగ్యం విషమించడంతో బీజేపీ పెద్దలు ఆయనను పరామర్శించేందుకు వెళుతున్నారు. రాష్ట్రపతి కోవింద్ కూడా ఎయిమ్స్ కు చేరుకొని పరామర్శించారు.బీజేపీలోని సీనియర్లు అంతా ఇలా వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవ్వడంపై మోడీ అప్ సెట్ గా ఉన్నట్టు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -