ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరశింహన్ స్థానంలో కేంద్రం ఏపీకీ కొత్త గవర్నర్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒడిషాకు చెందిన భాజాపా నేత అయిన బిశ్వ భూషన్ హరిచందన్ను నమిమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఛత్తీస్ గడ్ గవర్నర్ గా అనసూయ ఊకిని నియమించారు. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త గవర్నర్ గా నరసింహన్ వ్వహరించిన సంగతి తెలిసిందే.
బిశ్వభూషణ్ గతంలో ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హరి చందన్ నియామకంతో.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా ఉన్న నరసింహన్ కేవంలో తెలంగాణకు మాత్రమే పరిమితమవుతారు .
రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు గవర్నర్ను మారుస్తారని ప్రచారం జరిగినా అది జరగలేదు. కేంద్రంలో తిరిగి భాజాపా అధికారంలోకి రావడతో ఈ నర్ణయం తీసుకున్నారు.