Saturday, April 20, 2024
- Advertisement -

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం….

- Advertisement -

చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలు అని చూడకుండా వారిపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. వారిని న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధిస్తున్నా వారిలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా వికారాబాద్‌ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.తెలియని వాళ్ల కంటె తెలిసిన వాళ్లే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

వివరాల్లోకి వెల్తే….జిల్లా లోని పెద్దేముల్‌ మండలం రేగొండి గ్రామానికి చెందిన దంపతులు దినసరి కూలీలు. వీరికి ఐదేళ్ల కూతురు, కుమారుడు ఉన్నారు. శ్రావణ శుక్రవారం కూడా తల్లిదండ్రులు పనులకు వెళ్లిపోగా చిన్నారి ఒక్కత్తే ఇంటి ముందు ఆడుకుంటోంది. దీంతో బాలికపై కన్నేసిన పక్కింట్లో ఉండే మారేపల్లి నగేశ్ అనే యువకుడు చాక్లెట్స్ ఇస్తానని చెప్పి బాలికను తన గదిలోకి తీసుకెళ్లాడు. ఏడిస్తే చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

సాయంత్రం ఇంటికి తల్లి,దండ్రులు వచ్చే సరికి కూతురు అస్వస్థతగా ఉంది. దీంతో జ్వరం వచ్చిందోమోనని టాబ్టెట్ లు వేశారు. మరు సటి రోజు కూడా జ్వరం తగ్గకపోవడంతో తల్లి ఆందోళన పడింది. ఏం జరిగిందని బాలికను అడగగా తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పింది. ఇదే సమయంలో నిందితుడు నగేశ్ ఊరు వదిలి వెళ్లిపోయాడు. దీంతో గ్రామస్థులు అతడి కోసం వెతకగా పక్క ఊరిలోని బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించి రప్పించారు. తల్లిదండ్రుల ఎదుటే అతడికి దేహశుద్ధి చేయడంతో జరిగిన విషయం చెప్పి నేరాన్ని అంగీకరించాడు. పాప తల్లి,దండ్రలు పెద్దేముల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -