Tuesday, April 16, 2024
- Advertisement -

పుట్టిన‌రోజు నాడే యువ‌కుడు అనంత‌లోకాల‌కు…

- Advertisement -

స్హితులు, బంధువులు, త‌ల్లి, దండ్రుల‌తో క‌ల‌సి పుట్టిన రోజు వేడుకులు జ‌ర‌పుకోవాల్సిన యువ‌కునిపై విధి చిన్న‌చూపు చూసింది. రోడ్డు ప్ర‌మాదంలో తిరిగిరాని అనంత‌లోకాల‌కు వెల్లిపోయాడు. కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ ఆ యువకుడిని బలిగొంది. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాతీయ రహదారిపై శ్రీసిటీ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బీవీపాళెం గ్రామానికి చెందిన బాబు సయ్యద్‌ (16) అనే యువకుడు మృతిచెందాడు

వివ‌రాల్లోకి వెల్తే….బీవీపాళెంకు చెందిన బాబు అనే వ్యక్తి తమిళనాడులోని ఆరంబాకంలో చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతనికి సయ్యద్‌ ఏకైక కుమారుడు. బాబు ఉదయం హోటళ్లకు చికెన్‌ సరఫరా చేసి సాయంత్రం నగదు వసూలు చేస్తుంటాడు. మంగళవారం నూతన సంవత్స రం కావ‌డంతో ఎక్కువ వ్యాపారం జ‌ర‌గ‌డంతో …కుమారుడు సయ్యద్‌ని కలెక్షన్‌ కోసం పంపాడు..

మంగళవారం సయ్యద్‌ పుట్టినరోజు కూడా కావడంతో తడలోని మిత్రులను కూడా కలవొచ్చని ఆసక్తిగా తండ్రి బైక్‌పై బయలుదేరాడు. తడకు కొద్దిదూరంలోకి వచ్చిన సయ్యద్‌ని శ్రీసిటీ సమీపంలో బాలఏసు పుణ్యక్షేత్రం ఎదుట వెనుకనుంచి కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ వేగంగా ఢీకొంది. లారీ బైక్‌ను ఈడ్చుకుని వెల్ల‌డంతో తీవ్ర గాయాల‌పాయిన స‌య్య‌ద్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న తడ ఎస్సై దాసరి వెంకటేశ్వరావు సిబ్బం దితో కలిసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘట నా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క బిడ్డ తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -