Tuesday, March 19, 2024
- Advertisement -

హైవేపై అందంతో ఎర‌….చిక్కితే …..?

- Advertisement -

రాత్రి అయితే చాలు హైవేపై అంద‌గా త‌యార‌యి మ‌త్తెక్కించే చూపుల‌తో లారీ డ్రైవర్ల వ‌ల వేస్తుంది. అంద‌నాకి ఆక‌ర్శితులై ఆమె వెంట వెల్తే అంతే…ఇంకేముంది అందిన కాడికి నిలువునా దోచేస్తుంది. ఆమె ఒక్క‌తే కాదు వెన‌కాల గ్యాంగ్ కూడా ప‌నిచేస్తుంది. ఈ దందా అంతా నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. తన వలపులతో ఎందర్నో బురిడీ కొట్టించిన ఆమె ఎట్టకేలకు పోలీసులకు దొరికి క‌ట‌క‌టాల పాల‌య్యింది.

వివ‌రాల్లోకి వెల్తే….నెల్లూరు జిల్లా ఆమంచర్ల గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో అదే జిల్లా సంతపేటకు చెందిన రమాదేవితో అక్ర‌మ‌సంబంధం ఉంది. అనిల్ ఆటో న‌డుపుకుంటున్న అనిల్ వ‌స్తున్న డ‌బ్బులు చాల‌క‌పోవ‌డంతో ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఇంకే ముంది ప్ర‌యురాలును రంగంలోకి దింపార‌డు.తన ప్రియురాలు రమాదేవితో ఈ విషయంపై ఆలోచించి హైవేపై డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. వ‌ల‌పుల వ‌ల అనె దందాకు తెర‌లేపారు.అందుకు అనిత్ తన మిత్రులు మల్లి శ్రీనివాసులు, వీరేశం బాలవర్థన్ ల సహకారం తీసుకున్నారు. వీరుకూడా ఆటో డ్రైవ‌ర్లే.

ఈ క్ర‌మంలో రమాదేవికి మేకప్ వేసి రోడ్డుపై నిలబెట్టడ‌తారు. రాత్రి 8 గంటల తర్వాత ఈ వ్యవహారం అంతా మెుదలవుతుంది.అనంతరం ముగ్గురు స్నేహితులూ చీకట్లో తమ ఆటోను నిలిపి నక్కుతారు. చిమ్మ చీక‌ట్లో టార్చ్ లైట్ వేస్తూ లారీ డ్రైవర్లను ఆకర్షిస్తోంది. ఆమె అందానికి ఆకర్షితులైన లారీ డ్రైవర్లు ఆమె దగ్గరకు రాగానే తుప్ప‌ల్లోకి వెల్దామా అంటుంది. అంతే ఇంకేముంది అక్క‌డ అప్పటికే అక్కడ మాటు వేసిన అనిల్ అతని స్నేహితులు అతడిపై దాడి చేసి అతడి దగ్గర ఉన్న సొమ్మును దోచుకుంటారు. ఇలా ఎంతోమంది లారీ డ్రైవర్లు వీరి ఉచ్చులో పడి నిలువునా మోస‌పోయిన వాళ్లే.

ఖమ్మం జిల్లాకు చెందిన బత్తల శివాజీ అనే డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిఘా పెట్టి, సుందరయ్య కాలనీ దాటిన తరువాతి నిర్జన ప్రదేశంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి ఒక ఆటోతోపాటు రూ.5వేలు, వెండి బ్రాస్ లైట్, ఉంగరం స్వాదీనం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -