Thursday, April 25, 2024
- Advertisement -

యూత్ కి సత్య నాదెళ్ల సలహా

- Advertisement -

భారత యువతరం ధైర్యంగా ముందుకు వెళ్లాలని, దీని వల్ల భవిష్యత్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీకి సిఇవో కావడం వంటి కలలు సాకారం అవుతాయి అని మైక్రోసాఫ్ట్ సిఇవో సత్య నాదెళ్ల ఇక్కడి యువతకి సలహా ఇచ్చారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారత్ కు వచ్చిన సత్య నాదెళ్ల టెక్ ఫర్ ఐడియాస్ ఫర్ ఇండియా.. మంచి కోసం సాంకేతికత, భారత్ కోసం ఆలోచనలు అనే అంశంపై న్యూఢిల్లీలో ఆయన కీలక ప్రసంగం చేశారు.

భారతీయుల మేథోకుశలతను పెంపొందించేందుకు ఓ వేదికను అందించాలని మేం భావిస్తున్నాం. దాని కోసం శ్రమిస్తున్నాం అని సత్య నాదెళ్ల అన్నారు. కంటి చూపు లేని వారికి లేదూ తక్కువగా ఉన్న వారి కోసం అడ్వాన్స్డ్ లెవెల్ స్మార్ట్ గ్లాసెస్ వీడియోను ఈ సమావేశంలో ప్రదర్శించారు. దీనిని మైక్రోసాఫ్ట్ కు చెందిన హూలోలెన్స్ కంపెనీ రూపొందించింది. భారత్ వచ్చిన సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్రమోదీని కలిసారు. భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులతో కూడా సత్య నాదెళ్ల సమావేశమయ్యారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -