- Advertisement -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బావ అనిల్ కుమార్ పై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2009 మార్చి 28న ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే దానిపై ఆయనపై కేసు నమోదైంది.
ఆ సమయంలో అనిల్ కుమార్ ఖమ్మం జిల్లా కరుణగిరి ప్రాంతంలో ఓ పార్టీకి ఓటువేయాలంటూ కరపత్రాలు పంచారని అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా అనిల్ కుమార్ ఉన్నారు.
అయితే అనిల్ కుమార్ తన బిజీ షెడ్యూల్ వల్ల కోర్టుకు హాజరుకాలేకపోయారు . దీంతో కొన్ని వాయిదాలు చూసిన ఖమ్మం కోర్టు తాజాగా ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సోమవారం ఖచ్చితంగా అనిల్ కుమార్ ను కోర్టులో హాజరుపరచాలని ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి జడ్జి ఎం. జయమ్మ శుక్రవారం వారెంట్ జారీ చేశారు.