తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా కేసు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇప్పటికే సిని ప్రముఖులకు విచారనకు హాజరు కావాలని అధికారలు నోటీసులు జారీచేశారు.మరికొందరికి ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.దీనికి సంబందించి రోండో లిస్ట్ను సిద్దంచేస్తున్నారు అధికారలు.
డ్రగ్స్లో ప్రధాన సూత్రధారి కెల్విన్ ఫోన్ కాల్ టిస్ట్ అధారంగా రెండో జాబితాను సిద్దం చేస్తున్నారు. తరుచూ మాట్లాడే వారికి ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇస్తోంది. అయితే, మాట్లాడే వారు అందరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు కాదని చెబుతున్నారు.
కెల్విన్ సెల్ ఫోన్ లిస్ట్ ఆధారంగా ప్రముఖులకు నోటీసులు ఇస్తున్నారు. సాయంత్రానికి రెండో లిస్ట్ బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. దీంతో అప్పుడు ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయోనని సస్పెన్స్ కొనసాగుతోంది.ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే దుమారం రేపుతోంది.ఇప్పుడు బయట పెట్టబోయే రెండో లిస్ట్ ఎవరిదనే ఆందోళన,అసక్తి నెలకొంది.
ఇప్పటి వరకు సినీ ప్రముఖులకే నోటీలసులు ఇచ్చిన అధికారులు సాయంత్రానికి కొందరు బడాబాబుల పేర్లు బయటకు వస్తాయని వార్తలు వస్తుండటంతో డ్రగ్స్ తీసుకునే వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ పేర్లు బయటకు వస్తాయోనని పలువురిలో ఆందోళన ఉందని అంటున్నారు. సాయంత్రం పలువురు సినీ ప్రముఖులతో పాట పారిశ్రామికవేత్తల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశముందని అంటున్నారు.