పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్లో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖకు భారత్కూడా సానుకూలంగా స్పందించింది. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ముగ్గురు ఎస్పీఓలను, ఓ బీఎస్ఎఫ్ జవాన్ ని పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. దీంతో పాక్తో చర్చలను భారత్ తిరస్కరించింది.
భారత్ తిరస్కరణపై పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ లేఖలో ఘాటుగా స్పందించారు. భారత్ ను తప్పుబడుతూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. భారత్ తో శాంతి చర్చలకు సిద్ధమంటూ తాము చేసిన ప్రతిపాదనను భారత్ తిరస్కరించడం నిరాశకు గురిచేసిందని అన్నారు.
ఎలాంటి లక్ష్యం లేకుండా పెద్ద కార్యాలయాల్లో కూర్చుని పని చేసే వారిని తన జీవితంలో చాలా మందినే చూశానంటూ భారత ప్రధాని మోదీపై ఇమ్రాన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శాంతియుత చర్చల నిమిత్తం లేఖ రాసిన పాకిస్థాన్, మరోపక్క సరిహద్దుల్లో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటాన్ని భారత్ తీవ్రంగా నిరసించింది.
Disappointed at the arrogant & negative response by India to my call for resumption of the peace dialogue. However, all my life I have come across small men occupying big offices who do not have the vision to see the larger picture.
— Imran Khan (@ImranKhanPTI) September 22, 2018