- Advertisement -
భూకంపం పాకిస్థాన్ ను వణికించింది. పాక్ లోని పలు రాష్ట్రాల్లో భూకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూకంప ధాటికి పాక్ అక్రమతి కాశ్మీర్ లో 15 మంది చనిపోయారు. వంద మందికి పైగా గాయాల పాలయ్యారు. అనేక ఇల్లు నేలమట్టం అయినట్లు సమాచారం.
చాలా చోట్ల రోడ్లు కుంగిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు చీలిపోవడంతో అందులో వాహనాలు పడిపోయాయి. కార్లు, బస్సులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. మిర్పూర్లో భూకంపం విధ్వంసాన్ని స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర భారత దేశంలో కూడా భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.