Wednesday, April 24, 2024
- Advertisement -

వీడియో వైరల్: భారత జవాన్ల దాడిలో పాక్ సైనికుల హతం

- Advertisement -

కాల్పుల విరమణ ఉల్లంఘన ఒప్పందాలకు తూడ్లు పొడుస్తూ ప్రతీసారి భారత సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్. భారత భూభాగంలోకి వచ్చి మరీ ఈ దుశ్చర్యకు పాల్పడుతోంది. దీంతో ప్రతీకార చర్యగా భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతిచెందారు.

అయితే ఆ మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ సైన్యం వచ్చి తెల్లజెండాలు ఊపుతూ వారి మృతదేహాలను తీసుకెళ్లింది. ఈ వీడియోను భారత మీడియా తీసి విడుదల చేయడంతో వైరల్ గా మారింది.

భారత జవాన్ల కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన గులామ్ రసూల్ చనిపోయినట్టు సమాచారం. ఇతడు పీవోకేలోని హాజీపూర్ వద్ద భారత్ లోకి వస్తూ కాల్పులు జరపడంతో భారత జవాన్ల ప్రతీదాడిలో మరణించాడు. పంజాబ్ లోని బాహవల్ నగర్ కు చెందిన వాడిగా ఇతడిని గుర్తించారు.

ముందుగా భారత్ పై కాల్పులు జరుపుతూ మృతదేహాన్ని తీసుకెళ్లాలని పాక్ భావించింది. అయితే భారత్ కూడా తీవ్రంగా కాల్పులు జరపడంతో మరో సైనికుడు మృతిచెందాడు. దీంతో ఇక తెల్లజెండాలు ఊపి ఆ మృతదేహాలను తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ విడుదల చేయడంతో వైరల్ గా మారింది.

వీడియో ఇదే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -