అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటె ప్రపంచ ఆర్థిక వ్యవవస్థ మాంద్యం వైపు పయనిస్తోంది. ప్రధానంగా చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ ఆర్థిక మాంద్యానికి కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఏర్పడితే అది అభి చెందుతున్న చేశాలపై పడుతుంది. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటె ఇండియా కూడా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది. గత కొద్ది రెజలుగా దేశంలో జరగుతున్న పరిణామాలు చూస్తుంటె అలానె అనిపిస్తోంది. జీడీపీ రేటు తగ్గడం, మరో వైపు నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. బడా కంపెనీలు ఆర్థిక పరిస్థితులు తాలేక ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నాయి.
ఇదలా ఉంటె ఆర్థిక మాంద్యం వస్తోందంటూ సోషల్ మీడియాలో ఓవార్త హల్ చల్ చేస్తోంది. దేశంలో ఆర్తిక మాంద్యం మొదలయ్యింది.మొత్తం ఆర్థిక మార్కులో దాదాపు 13.67 శాతం పతనం నమోదైంది. విదేశీ మారకం, రెపో రేటులో కూడా సంక్షోభం ప్రారంభమైందని సూచిస్తున్నాయి. గత త్రైమాసికంలో ఇప్పటికే 17 లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయారు. ఆర్థిక మాంద్యం నుంచి కొంతైనా బయట పడాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి అంటూ సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది.
- అదనపు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి.
- వచ్చే 6 నెలల్లో రియల్ ఎస్టేట్ పథనం కాబోతోంది కావున ప్లాట్లు కొనుగోలు చేయడం ఆపండి.
- ఇప్పుడు పెట్టుబడికి దూరంగా ఉండండి,
- ఇప్పుడు బంగారం కొనకండి, డిసెంబర్ నుండి ధర తగ్గే అవకాశం ఉంది.
- మధ్యస్థమైన వ్యక్తులు, చిన్న వ్యాపారం ఎక్కువగా నష్టపోతుంది, కాబట్టి మీ బడ్జెట్ను కఠినతరం చేయండి.
- సైట్లు ఇప్పటికే నష్టంలో ఉన్నందున ఆన్లైన్ కొనుగోలు ప్రమాదకరంగా ఉంటుంది.
- మీ అన్ని డిజిటల్ లావాదేవీల డబ్బును (Paytm, Gpay etcetc) భౌతిక నిధిగా మార్చండి / వినియోగించండి.
- మీ కుటుంబ ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వండి. అన్ని EMI లను మూసివేయడానికి ప్రయత్నించండి. గృహ రుణాలతో కొత్త ఫ్లాట్ కొనకండి… బ్యాంక్ లేదా ప్రైవేట్ ఫైనాన్స్తో కొత్త కార్లు కొనకండి.
- అప్రమత్తంగా ఉండండి – రోడ్లపై స్నాచింగ్, రాబోయే పండుగ కాలం నుండి దోపిడీ పెరుగుతుంది.
- ఇప్పటి నుండి మీ 6 నెలల ఖర్చులను కూడబెట్టుకోవడానికి ప్రయత్నించండి. నవంబర్, డిసెంబర్ 2019 నుండి పరిస్థితి అధ్వాన్నంగా ఉండవచ్చు. ఇది 2020 మధ్య వరకు కొనసాగవచ్చు.
దయచేసి అప్రమత్తంగా ఉండండి.