మెగా కోడలు ఉపాసనకు టైమ్ కలిసొచ్చిందనే చెప్పాలి. నిజంగా ఇది ఖుషీ టైమ్ కాబట్టే… హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఆమె అటెండైంది. మహిళా సాధికారితపై ఇవాంకా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండడంతో డైనమిక్ ఎంటర్ ప్రెన్యూవర్గా ఆమెకూడా సదస్సుకు హాజరైంది.
హాజరవ్వడమే కాకుండా… పనిలోపనిగా చీఫ్ గెస్ట్ ఇవాంకా ట్రంప్తో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవాంకా, నరేంద్రమోదీ, తెలంగాణ సర్కార్లకు కృతజ్ఞతలు అంటూ క్యాప్షన్ పెట్టింది. మెగా ఫ్యామిలీ కోడలిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఉపాసన అపోలో గ్రూప్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ ఎంటర్ ప్రెన్యూవర్గా పేరు తెచ్చుకుంది.అదే ఇదితో ఇపుడిలా ఇవాంకాతో ఓ ఫొటో వేసుకుంది. అన్నట్లు ఇంకో విషయం మంచు లక్ష్మీకూడా ఈ సదస్సుకు హాజరై ఇవాంకా పక్కన ఆశీనులవుదామనుకుందట. ఆమె చెప్పే స్పీచ్ ను తనే ట్రాన్స్ లేట్ చేయాలనుకుందని తెలిసింది. లాస్ట్ మినిట్ కేటీరీ నేనున్నా అంటూ ముందుకొచ్చేశాడని మంచు సర్కిల్ లో ఏవో రూమర్లు సర్కులేట్ అవుతున్నాయి.ఈ మాటలు నమ్మొచ్చంటారా….