- Advertisement -
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ను దాఖలు చేశారు. ముందుగా కాలభైరవ ఆలయంలో పూజలు చేసిన అనంతరం వారణాసి కలెక్టర్ వద్ద ఎన్డీయే పక్షాల నేతలతో ప్రధాని మోదీ సమావేశమై కాసేపు మాట్లాడారు. అనంతరం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాల నేతలు.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రాంవిలాశ్ పాశ్వాన్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం హాజరయ్యారు.నామినేషన్ వేసేందుకు బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు మోదీ. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.