ప్రధాని మోడీ మరోసారి తన అప్యాయతను చాటారు. వారణాసిలో రిక్షా తొక్కే మంగళ్ కేవత్ అనే వ్యక్తి కూతురి పెళ్లికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. మంగళ్ కేవత్ కూతురి పెళ్లి సందర్భంగా అతడి కుటుంబానికి దీవెనతో కూడిన లేఖను మోడీ రాశారు. ఈనెల 12న వివాహం జరగగా.. నాలుగురోజుల ముందే ఆ ఫ్యామిలీకి మోడీ లేఖ పంపడం విశేషం.
మోడీ లేఖలో తన అభిమానాన్ని చాటారు. ‘నీ కుమార్తె వివాహాన్ని పురస్కరించుకొని ఆమెకు, నీ కుటుంబానికి నా ఆశీస్సులు ’ అంటూ మోడీ లేఖలో మంగళ్ కేవత్ ఫ్యామిలీని ఆశీర్వదించారు.
ప్రధానమంత్రి దత్తత తీసుకున్న డోమ్రీ గ్రామంలో మంగళ్ కేవత్ ఉంటున్నాడు. ఆయన కూతురి శుభలేఖను స్వయంగా ప్రధాని మోడీ కార్యాలయంలో అందజేసి పెళ్లికి ఆహ్వానించాడు. మోడీ రాకున్న ఆశీర్వదిస్తూ లేఖ పంపడంతో వారి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఇలా మోడీ తను పోటీచేసిన వారణాసి నియోజకవర్గంలో ప్రజలతో టచ్ లో ఉంటూ వారి ప్రేమానురాగాలను పొందుతున్నారు.