Saturday, April 20, 2024
- Advertisement -

శ్రీరెడ్డిపై దాడి..

- Advertisement -

శ్రీరెడ్డి పేరు తెలియ‌ని వారు తెలుగు ఇండ‌స్ట్రీలో ఉండ‌రు. సినీ ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపుల‌పై సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు శ్రీ రెడ్డి సంచ‌ల‌నాలు త‌మిళ‌నాట కూడా పాకిపోయాయి. ఆ మ‌ధ్య వ‌ర‌స‌గా తెలుగు సెలెబ్రెటీల‌పై నోరు పారేసుకున్న శ్రీ రెడ్డి.. ఇప్పుడు త‌మిళ‌నాడుపై ప‌డింది. అక్క‌డ కూడా కొంద‌రు టాప్ హీరోల‌ను టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. అయితే ఈమె ఇంటిపై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేసారు. చెన్నైలో తాను ఉంటున్న ఇంటిపై అర్ధ‌రాత్రి వ‌చ్చి ఇద్ద‌రు దుండ‌గులు దాడి చేసార‌ని వ‌ల‌స‌ర‌వాకం పోలీస్ స్టేషన్ లో కేస్ పెట్టింది శ్రీరెడ్డి.

ప్ర‌స్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటోంది. కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తుండటంతో పాటు, తన బయోపిక్ రెడ్డీస్ డైరీ కూడా అక్కడే తెరకెక్కుతుండటంతో శ్రీరెడ్డి చెన్నైలోనే ఎక్కువగా ఉంటోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తరవాత సుబ్రమణి, గోపీ తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని, చంపేస్తామని బెదిరించారని శ్రీరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొంది.

శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. పొలాచ్చి సెక్స్ రాకెట్ తమిళనాడులో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. కళాశాలల్లో చదువుకొనే 20 ఏళ్ల లోపు అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకొని ఆ దృశ్యాలను వీడియోలుగా తీసి వ్యాపారం చేసుకొంటున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టుచేశారు. ఈ విష‌యంలో శ్రీరెడ్డి త‌ల దూర్చ‌డ‌మే కార‌నంగా క‌నిపిస్తోంది.

మ‌రోవైపు శ్రీ రెడ్డి మాత్రం తాను పొల్లాచ్చి ఘ‌ట‌న‌పై క‌చ్చితంగా మాట్లాడ‌తాను అంటుంది. ఇలాంటి బెదిరింపుల‌కు తాను అస్స‌లు భ‌య‌ప‌డ‌న‌ని.. తన ఇంటిపై జ‌రిగిన దాడిలో కాస్తలో త‌న‌కు ప్రాణాపాయం త‌ప్పింద‌ని ఫిర్యాదు చేసింది శ్రీ రెడ్డి. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. శ్రీరెడ్డిపై దాడికి పొలాచ్చి సెక్స్ రాకెట్ వ్యవహారమే కారణమైతే పోలీసులకు సుబ్రమణి తనపై దాడిచేశాడని ఆమె ఎందుకు ఫిర్యాదు చేశారో అర్థం కావడంలేదు. ఈ కేసు ఎన్నిమ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -