Thursday, April 25, 2024
- Advertisement -

ఉదయం ఎన్టీఆర్, మధ్యాహ్నం మహేష్, రాత్రికి ప్రభాస్‌తో…

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. డీజే సినిమా త‌రువాత వ‌రుస‌విజ‌యాల‌తో ముందుఎల్తోంది. సక్సెస్, ఫెయిల్యూతో సంబంధం లేకుండా ఆమె స్టార్ హీరోల సినిమాలు దక్కించుకుంటోంది.ఆమె కోసం హీరోలు ఎంతగా పరితపిస్తున్నారంటే, రోజులో ఒకేసారి 3 షిఫ్టుల్లో ముగ్గురు పెద్ద హీరోలతో పనిచేసింది పూజా హెగ్డే. తన కెరీర్ లో అదే బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అంటోంది.

ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్‌ సరనస హీరోయిన్‌గా నటించిన ‘అరవింద సమేత’ ఇప్పటికే రిలీజ్‌ కాగా, మహేష్‌ సరసన నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్‌ మీద ఉంది. మ‌హ‌ర్షిసినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా టాప్‌ స్టార్స్‌తో కలిసి నటించటంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి, ప్రభాస్‌ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరగటంతో పూజా..ఒకే రోజు ముగ్గురు హీరోలతో కలిసి నటించాల్సి వచ్చిందట.

ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్టీఆర్‌తో అరవింద సమేత, తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు మహేష్‌ మహర్షి, రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు ప్రభాస్‌ సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నారట. తనకు పెద్దగా నిద్ర అక్కర్లేదని, ఎంత తక్కువ పడుకుంటే తను అంత అందంగా కనిపిస్తానని చెబుతోంది.ఇలాంటి అవకాశం రావడం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -