సినిమా రచయత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సినీ పరిశ్రమపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ బాబు విమర్శలపై సినీ పరిశ్రమకు చెందిన వారు ఖండిస్తున్నారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు చేయగా.. పోసాని కృష్ణమురళీ నిన్న విమర్శలు చేయగా నేడు కూడా విమర్శలు చేశారు.
ఈసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశాడు. ఇటు పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను పొగడ్తల్లో ముంచెత్తాడు. రెండు రోజులుగా తనదైన శైలిలో పోసాని పొలిటికల్ పంచ్లు వేస్తున్నాడు. ఈ సారి ఆయన టార్గెట్ చేసింది టీడీపీ పార్టీని, అయితే ఆయన టీడీపీతో సెటైర్ వేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచేశాడు.
పది రోజుల కిందట ప్రత్యేక హోదా సంజీవిని కాదు.. అని ప్యాకేజ్ చాలు అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మీరు రాత్రికి రాత్రి మాట మారిస్తే మీ వెనకాల మేము రావాలా అని ప్రశ్నించారు. అసలు సిసలైన లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కేసీఆర్ అని, తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమయ్యాడు అని గుర్తుచేశారు. అంతే తప్ప మీలా (చంద్రబాబు) రోజుకొక మాట మార్చలేదు అని కేసీఆర్పై పొగడ్తలు కురిపించాడు.