పేదవారి కడుపు నింపే కోసం ఏపీ ప్రభుత్వం అన్నాక్యాంటీన్లను రాష్ట్ర వ్యప్తంగా ఏర్పాటు చేసింది. ఈ పథకం ద్వారా అన్నా క్యాంటీన్ల ద్వారా ₹ 5/-కే పేదోడి కడుపు నింపుతోంది. కొందరు పలుకుబడి కల వ్యక్తులు దాని స్వరూపాన్నే మార్చేశారు. వ్యభిచార క్యాంటీన్గా మార్చేశారు.
వివరాల్లోకి వెల్తే…అనంతపురం జిల్లా హిందూపురంలోని అన్నా క్యాంటీన్లో వ్యభిచార బాగోతం బట్టబయలు అయ్యింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అన్నా క్యాంటీన్ లో పగటివేళ ఆహారం — రాత్రి వేళ వ్యభిచారం నడుపుతూ రెండు రకాలుగా దాహం తీరుస్తున్నారని ప్రచారంలో ఉంది . శనివారం రాత్రి వాచ్మెన్ జయరాం ఓ మహిళతో రాసలీలలు జరుపుతుండగా స్థానికులు పట్టుకున్నారు.
మీడియా ప్రతినిధులు వాచ్-మెన్ ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. కేసు నమోదుచేసి విచారించాల్సిన పోలీసులు వారిని ఊరకే వదిలేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.