Friday, March 29, 2024
- Advertisement -

వాట‌ర్ క‌ట్ : పాక్‌కు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌

- Advertisement -

పుల్వామా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో తీవ్ర మైన చ‌ర్య‌ల‌కు భార‌త్ సిద్ద‌మ‌వుతోంది. ఈ ఘ‌ట‌న‌పై యావ‌త్ భారత ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్నారు. ఉగ్ర‌వాదానికి ఊత‌మిస్తున్న పాక్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్ప‌టికే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాల‌ను భార‌త్ తేంచేసుకుంది.తాజాగా మ‌రో క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకుంది.

అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. ఇటు దౌత్యపరంగానూ దెబ్బకొడుతోంది. యుద్ద క్షేత్రంలోకి అడుగు పెట్ట‌కుండానే పాక్‌ను హ‌స్ట‌దిగ్భందనం చేస్తోంది. ఇప్పటికే ఎంఎఫ్‌ఎన్ హోదాను ఉపసంహరించుకోవడంతోపాటు ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులకు కస్టమ్స్ డ్యూటీని 200 శాతం పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా సింధు జలాల్లో తన వాటాను పాకిస్థాన్‌కు వాడుకోకుండా అడ్డుకోవాలని భారత్ నిర్ణయించింది.

పాకిస్తాన్‌లోకి ప్రవహిస్తూ..అక్కడి ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీరుస్తున్న భారత జలాలను నిలిపివేయబోతోంది. ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆ జలాలను జమ్ము ప్రజలకు అందిస్తామని..అటు నుంచి యమునా నదికి తరలిస్తామని ట్విట్ట‌ర్ ద్వారా స్పష్టంచేశారు.

సింధూ జలాల ఒప్పందం-1960 ప్రకారం తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్ జలాలను వాడుకునేందుకు భారత్‌కు హక్కుంది. పశ్చిమ నదులు సింధూ, జీలం, చినాబ్ జలాలను పాకిస్తాన్ వాడుకోవచ్చు. అయితే సింధూ న‌దీ జ‌లాల‌ను పూర్తిగా భార‌త్ వాడుకోవ‌డంలేదు. తనకు కేటాయించిన జలవనరుల్లో భారత్ 93-94 శాతం వాడుకుంటోంది. మిగతా జలాలను వృథాగా పాకిస్థాన్‌కు వదిలేస్తోంది. పుల్వామా దాడి ఘ‌ట‌న‌తో ఆనీటిని కూడా పాక్‌కు వెల్ల‌కుండా జ‌మ్మూ, కాశ్మీర్ ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని నిర్ణ‌యించింది కేంద్రం.

Under the leadership of Hon’ble PM Sri @narendramodi ji, Our Govt. has decided to stop our share of water which used to flow to Pakistan. We will divert water from Eastern rivers and supply it to our people in Jammu and Kashmir and Punjab.— Nitin Gadkari (@nitin_gadkari) February 21, 2019

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -