Thursday, April 25, 2024
- Advertisement -

రాహుల్‌కు సుప్రీంకోర్టు నోటీసులు…

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల ఫ‌లింత‌గా రాహుల్ ఇబ్బందుల్లో ప‌డ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దొంగ అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీచేసింది సుప్రీంకోర్టు. తన వ్యాఖ్యలపై ఈ నెల 22లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు నోటీసుల్లో ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23న చేపడతామని పేర్కొంది.

రఫేల్‌ తీర్పుపై రాహుల్‌ గాంధీ ‘కాపలాదారే దొంగ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.కాపలాదారే దొంగ అని మేము ఎప్పుడూ అనలేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించవద్దని రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -