- Advertisement -
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందగా మరో ఐదుగురు తీవ్రగా గాయపడ్డారు. గాయపడ్డవారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జోధ్పూర్లోని ధాధానియా గ్రామానికి సమీపంలోని జైసల్మేర్ – జోధ్పూర్ రోడ్డుపై బస్సు – మినీ బస్సు ఢీకొన్నాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కాగా జాతీయ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.