- Advertisement -
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరంను నిన్న రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అనేక హైడ్రామాల మధ్య ఆయనున్న అరెస్ట్ అయ్యారు. అయితే చిదంబరం అరెస్ట్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేశారు.
మోదీ ప్రభుత్వాన్ని పొగిడారు. చిదంబరం అరెస్ట్ ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం అని కితాబిచ్చారు. “చిదరంబరం అరెస్ట్ ప్రజాస్వామ్య ప్రతిరూపానికి ప్రతిరూపం. ఆయన అరెస్ట్ లో ఓ స్పెషల్ ఉంది. కేంద్ర హోమ్ మంత్రి హోదాలో సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించింది చిదంబరమే. ఇప్పుడు అదే కార్యాలయంలో ఆయన కస్టడీలో ఉన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నరేంద్ర మోదీ ఇండియా మళ్లీ నిరూపిస్తోంది” అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.