ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఐదు చోట్ల రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయిచందిం. పోలంగ్ సమయంలో టీడీపీ నేతులు రిగ్గింపుకు పాల్పడ్డారని వైసీపీనేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడ రీపోలింగ్ జరపాలనో నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో రీపోలింగ్ జరపాల్సిన కేంద్రాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతో ఈ విజ్ణప్తిని పరిశీలించిన సీఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.
చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 19న రీపోలింగ్ ఉంటుందని ఈసీఐ పేర్కొంది. కొత్త కండ్రిగ (బూత్ నెం.316), వెంకట్రామపురం (బూత్ నెం.313), కమ్మపల్లి (బూత్ నెం.318, 321), పులివర్తిపల్లి (బూత్ నెం.104)లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు.