Thursday, April 25, 2024
- Advertisement -

కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. ఇటలీ ప్రకటన..!

- Advertisement -

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరణాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు ఇటలీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ప్రపంచంలోనే మొదటిసారిగా మానవులపై పనిచేయగల కరోనా వైరస్ వ్యాక్సిన్ ను అభివృద్ది చేసినట్లు ప్రకటించింది. తమ శాస్త్రవేత్తలు కరోనాకు మందుని తయారు చేశారని ఇటలీ చేసిన ప్రకటనతో ప్రపంచదేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.

రోమ్ లోని స్పల్లంజానీ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో… ఈ వ్యాక్సీన్ ఎలుకల్లో యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు. ఇది మానవ కణాలపైనా సమర్దంగా పని చేస్తుందని ఇటలీ పరిశోధకులు అంటున్నారు. నోవల్ కరోనా వైరస్ వ్యాక్సీన్ కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో ఇదే అతిపెద్ద ముందడుగు అని దీన్ని తయారు చేస్తున్న టకిస్ సంస్థ సీఈవో లుయిగి ఆరిసిచియో తెలిపారు. ఈ వేసవి తర్వాత మనుషులపై పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఎలుకలకు ఒక్క డోస్ ఇవ్వగానే.. ఎలుకల్లో యాంటీబాడీలు అభివృద్ధి చేసిందని ఇది వైరస్ ను మానవ కణాలకు సోకకుండా నిరోధించగలదని అరిసిచియో అన్నారు. ఫలితాలు అంచనాలకు మించి ఉన్నాయని ఇటాలియన్ పరిశోధకులు వ్యాఖ్యానించారు. అమెరికన్ ఔషధ సంస్థ లీనియాఆర్ఎక్స్ తో టకిస్ మరింత మమ్మురంగా పరిశోధనలు సాగించనున్నట్టు అరిసిచియో తెలిపారు. కాగా ఇటలీలో కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇక్కడ 213013 కేసులు నమోదు కాగా.. 29315 మరణాలు నమోదయ్యాయి. 85231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -