Thursday, April 18, 2024
- Advertisement -

వైఎస్ ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం….నలుగురు దుర్మరణం

- Advertisement -

కడప జిల్లా చిన్నమండెం మండలంలోని కేశాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బెంగళూరు నుంచి కడపకు వెళ్తున్న కారు.. అతివేగంతో లారీని ఢీకొట్టినట్టు తెలుస్తోంది.ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉండగా.. వీరంతా కడప వాసులేనని గుర్తించారు.

కారు అతివేగంతో లారీని ఢీకొట్టడంతో.. మృతదేహాలు కూడా నుజ్జనుజ్జయిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.బెంగళూరులో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -