- Advertisement -
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈనెల 9, 17 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ, ఈనెల 10,16 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని.
13న హైదరాబాద్-కాకినాడ, 14న కాకినాడ-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు, 17న కాకినాడ పోర్టు నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు, నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఇక ఈనెల 11, 18 తేదీల్లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, 18న కాకినాడ-తిరుపతి, 15న తిరుపతి- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.