Thursday, April 25, 2024
- Advertisement -

అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతున్న ఏసీబీ చీఫ్

- Advertisement -

జగన్ ఆదేశిస్తాడు.. ఏసీబీ చీఫ్ పాటిస్తాడు.. ఇప్పుడు ఏపీలో ఈ ఇద్దరి జోడి అద్భుతాలు సృష్టిస్తోంది. ఏపీలోని అవినీతిని ఏరిపారేస్తోంది. మొన్నటికి మొన్న రవాణాశాఖ కమిషనర్ గా ఉన్న సీతారామాంజనేయులు తన పనితీరుతో జగన్ ను ఆకర్షించారు. రాయలసీమకు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ ఆటకట్టించాడు. అక్రమంగా నడుస్తున్న జేసీ బస్సులను సీజ్ చేసి సంచలనం సృష్టించాడు. గడిచిన కొన్నేళ్లుగా బస్సుల సామ్రాజ్యాన్ని నిర్మించి అక్రమాలకు ఆలవాలంగా రాజకీయ అండదండలతో నిర్మించిన జేసీ దివాకర్ రెడ్డి సామ్రాజాన్ని కూల్చిన ఘనత ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులదేనని అంటుంటారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అక్రమాలను కూడా బయటపెట్టి రికవరీ చేయించారు.

తాజాగా ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక సీతారామాంజనేయులు మరింత సత్తా చూపించారు. తన మార్క్ ను ఏసీబీపై కూడా వేశారు. ఏపీలోని అవినీతిని పెకిలించడానికి సీతారామాంజనేయులు సేవలు అవసరం అని భావించిన జగన్ రవాణాశాఖ కమిషనర్ పోస్టుతోపాటు ఏసీబీ పోస్టు కూడా కట్టబెట్టారు.

తాజాగా సీఎం జగన్ రెవెన్యూశాఖపై వస్తున్న ఫిర్యాదులు, అవినీతిపై సీరియస్ అయ్యారు. ఏపీ రెవెన్యూ శాఖ అవినీతితో భ్రష్టుపట్టిందని భావించి దాన్ని పారద్రోలడానికి పూనుకున్నారు. ఈ బాధ్యతను ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులుకు అప్పగించారు.

శుక్రవారం ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఏపీలో అవినీతికి ఆలవాలంగా మారిన రెవెన్యూ అవినీతిపై ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. శుక్రవారం ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు స్వయంగా సీఎం జగన్ ను కలిశారు. రెవెన్యూ కార్యాలయాలపై దాడులపై సీఎం జగన్ కు వివరిస్తున్నారు.

ఇలా రవాణా శాఖయే కాకుండా రెవెన్యూ,రిజిస్ట్రేషన్ ఇలా అన్ని శాఖలపై పడి ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు ఏపీ అవినీతిపై శివాలెత్తిపోతున్నారు. అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతున్నారు. జగన్ ఆదేశాలతో రెవెన్యూశాఖపై జరిగిన ఈ దాడి ఏపీ అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -