- Advertisement -
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి బలైన చిన్నారి సుమేధ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సరదాగా ఆడుకుందామని కళ్లెదుటే భయటకు వెళ్లిన చిన్నారి విగత జీవిగా ఇంటికి చేరటంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నా బిడ్డ చేసిన తప్పేంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.
మల్కాజ్ గిరి పటేల్ నగర్ స్మశాన వాటికలో దహన సంస్కారాలు పూర్తయ్యాయి. నాలాలో పడిపోయిన చిన్నారి సుమేధా తలకు బలమైన గాయం అయ్యిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. గాయానికి తోడు ఊపిరితిత్తుల్లో నీరు చేరి మరణించిందని… గాయానికి తో నీట మునగటంతోనే ప్రాణాలు కోల్పోయిందని రిపోర్టులో డాక్టర్లు పేర్కొన్నారు.