Saturday, April 20, 2024
- Advertisement -

కరోనా వచ్చిందా లేదా అని టెస్ట్ చేయడానికి ఖర్చు ఎంతంటే ?

- Advertisement -

ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. ఈ వైరస్ పేరు వింటేనే జనం భయంతో వణికిపోతున్నారు. ఇండియాలోకి కూడా ఈ వైరస్ ప్రవేశించింది. ఇక్ ఈ కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయం నిర్దారించేందుకు నిర్వహించే ఒక్కో పరీక్షకు 4500 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఖర్చు అవుతుందట. దేశవ్యాప్తంగా డయోగ్నోస్టిక్స్ ల్యాబ్ ల నెట్ వర్క్ ను నిర్వహిస్తోన్న ‘ట్రివిట్రాన్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్’ చైర్మన్ జీఎస్ కే వేలు ఈ విషయాన్ని తెలిపారు.

ఈ పరీక్షను నిర్వహించేందుకు అవసరమైన అత్యాధునిక పరిజ్ఞానాన్ని భారత్ ల్యాబ్లు జర్మనీ అమెరికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని దేశంలోనే అభివృద్ధి చేసుకున్నట్లయితే 500 రూపాయల చొప్పున పరీక్షలు నిర్వహించవచ్చని ఆయన తెలిపారు. భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకారం కరోనా వైరస్ ప్రాథమిక పరీక్షకు 1500 రూపాయలు అనంతరం నిర్వహించే నిర్ధారణ పరీక్షకు 3000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రులు ప్రభుత్వ ల్యాబ్లే నిర్వహించగా ఇక ముందు నుంచి ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉచితంగా నిర్వహించాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి తాజగా పిలుపునిచ్చింది.

అయితే ఈ విషయంలో ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయకపోవడం తో ప్రజల్లో గందరగోళం నెలకొంది. కాసులకు కోసం ఆశ పడే ప్రైవేటు హాస్పిటల్స్ ఫ్రీగా ఈ వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తాయా ఒకవేల చేసినా అప్పుడు వాటి పరీక్షల్లో ప్రామాణికత ఉంటుందా ? అన్నది ప్రజల సందేహం. ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ప్రస్తుతం అనుమానితులందరికి ఈ వైద్య పరీక్షలు నిర్వహించకుండా కరోనా విస్తరించిన దేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ నిర్ధారిత సన్నిహితులకు కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇక దేశంలో మొత్తంగా వందలోపు వ్రైవేటు ల్యాబ్ లకే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఉందని జీఎస్కే వేలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -