Friday, March 29, 2024
- Advertisement -

ఘోర రోడ్డు ప్రమాదం…ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

- Advertisement -

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విశాఖపట్నంలో ఒకే కేటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెల్తే…. విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన నీలకంఠరావు కుటుంబం గురువారం రాత్రి తిరుమలకు బయలుదేరింది. రాత్రికి అన్నరవంలో బస చేసి ఉదయం బయలు దేరారు.

ప్రయాణిస్తోన్న వాహనం నల్లజర్ల వద్దకు రాగానె ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది.ఈ ఘటనలో భార్యాభర్తలు నీలకంఠరావు (55), లక్ష్మీ (50) అక్కడికక్కడే చనిపోయారు. వీరి మనవరాలు తనూజ(3), మనవడు జ్ఞానేశ్వర్‌ (8నెలలు) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన వారి అల్లుళ్లు రామకృష్ణ(45), అప్పలరాజు(35) ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గాయపడిన మణికంఠ, రమాదేవి, నీలిమ, రేష్మ, యశ్విన్‌లు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.జ్ఞానేశ్వర్‌ పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వారు తెలిపారు.గాయపడిన వారిలో వ్యాన్‌ డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -