టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి ఈ మధ్య సినిమా వాళ్లను వదిలేసి రాజకీయ నాయకుల మీద పడినట్లుంది.తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్పై తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి.తాజాగా ఆమె తెలుగు దేశం ఎంపీపై తన ఫేస్ బుక్లో కామెంట్స్ చేసింది.అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ జయదేవ్ గల్లా గళమెత్తిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై ఆయన ఇచ్చిన స్పీచ్, కేంద్ర ప్రభుత్వం నుండి మొదలుపెట్టి రెండు రాష్ట్రాలను విడగొట్టిన అన్ని పార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు.జయదేవ్ ఇచ్చిన స్పీచ్ పై నటి శ్రీరెడ్డి కూడా స్పందించింది.
ఎంపీ గల్లా జయదేవ్ ఇచ్చిన స్పీచ్ పై స్పందిస్తూ.. ”మిమ్మల్ని చూసి ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది గల్లా జయదేవ్ గారు.. పార్లమెంట్ లో మీరు ఇచ్చిన ప్రసంగం అద్భుతం. మీరు మాట్లాడుతుంటే ప్రత్యర్థుల ముఖాల్లో నెత్తుటి చుక్క కూడా లేదు.. గ్రేట్ లీడర్” అంటూ రాసుకొచ్చింది. శ్రీరెడ్డి తాజాగా తమిళ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకోని కామెంట్స్ చేయడం మొదలు పెట్టింది.దీనిపై తమిళ ఇండస్ట్రీ కూడా శ్రీరెడ్డిపై యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.