Thursday, March 28, 2024
- Advertisement -

సీఎం జగన్ పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్

- Advertisement -

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఏం చేసినా సంచలనమే.. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై యుద్ధం ప్రకటించిన శ్రీరెడ్డి మా అసోసియేషన్ ముందు చేసిన రచ్చా అంతా ఇంతకాదు.. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖల లైంగిక వేధింపుల గుట్టు మట్లను సోషల్ మీడియాలో ఎండగట్టి దుమారం రేపారు. సోషల్ మీడియా సాక్షిగా పవన్ కళ్యాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటున్నారు. అక్కడ సినిమా అవకాశాలు రావడంతో సినిమా చేస్తూ బిజిబిజీగా గడుపుతున్నారు. ఏపీ పాలిటిక్స్ గురించి ఏపీ గురించి మాట్లాడింది తక్కువ. కానీ తాజాగా మళ్లీ శ్రీరెడ్డి తన మాటల వాడిని పెంచారు. తాజాగా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి శ్రీరెడ్డి పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో జగన్ ను హెచ్చరించారు. జగన్ గారు జాగ్రత్తగా ఉండాలంటూ కోరారు. శత్రువులు కొత్త కోరలతో పదును పెడుతున్నారని.. వాళ్ల ఆలోచన పూర్తి అయ్యేలోపే మనం వాళ్లను నరికేయాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే శ్రీరెడ్డి చేసిన పోస్టు పవన్ కళ్యాన్ ను ఉద్దేశించే అని వైసీపీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక చంద్రబాబు నైజం గురించి అంటూ పలువురు కామెంట్ చేశారు. మొత్తం జగన్ శత్రువులను అంతం చేయాలని శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.

https://www.facebook.com/iamsrireddy/posts/2458455674401350

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -