త్వరలో జరగనున్న ప్రపంచకప్కోసం అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లండు, ఇండియా, ఆసిస్లు తమ జట్లను ప్రకటించగా ఇప్పుడు శ్రీలంక కూడా ప్రపంచకప్ లో పాల్గొనే జట్టును ప్రకటించింది. కెప్టెన్సీ రేసులో ఉన్న దినేశ్ చండిమాల్, ఉపుల్ తరంగాలకు ఆదేశ బోర్డు షాక్ ఇచ్చింది. వారిని కనీసం జట్టులో కూడా స్థానం కల్పించలేదు. 2015 తర్వాత శ్రీలంక తరఫున కనీసం ఒక్క వన్డే మ్యాచ్లో కూడా ఆడని దిముత్ కరుణరత్నెకు పగ్గలు అప్పజెప్పారు. అతడ్ని ప్రపంచకప్కి ఎంపిక చేయడమే కాకుండా జట్టు పగ్గాలు కూడా ఇవ్వడం ఇప్పుడ హాట్ టాపిక్గా మారింది. సీనియర్ లసిత్ మలింగను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. నిరోషన్ డిక్వెల్లా, అఖిల ధనంజయకు నిరాశే మిగిల్చారు.
జట్టు వివరాలు..
దిముత్ కరుణరత్నె (కెప్టెన్), ఏంజిలో మాథ్యూస్, తిసార పెరీరా, కుశాల్ పెరీరా, ధనుంజయ డిసిల్వా, కుశాల్ మెండిస్, లసిత్ మలింగ, ఇసురు ఉదాన, మిలింద సిరివర్ధనె, ఫెర్నాండో, జీవన్ మెండిస్, తిరుమానె, జెఫ్రీ వండర్సాయ్, నువాన్ ప్రదీప్, లక్మల్