• మహా విద్యాఫీఠం వ్యవస్ధాపకులు చింతపల్లి సుభ్రహ్మణ్య శర్మ
• తోమ్మిది రోజుల పాటు జరగనున్న శ్రీ రామ ధీక్ష కార్యక్రమం.
మహా విద్యాపీఠం, ధర్మ జాగరణ సమితి అధ్వర్యంలో మార్జి 25 నుండి ఏప్రీల్ 2 తేధి వరకూ ఏపీ లో శ్రీరామధీక్ష కార్యక్రమాని చేపడుతున్నామని మహా విద్యాఫీఠం వ్యవస్ధాపకులు చింతపల్లి సుభ్రహ్మణ్య శర్మ తెలిపారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే శ్రీరామ ధీక్ష చేపట్టాడానికి దాదాపు లక్ష మంది అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ముందుకు వచ్చారని అన్నారు.
ఈ దీక్షకు సంబంధించిన శ్రీరామ రక్షా స్తోత్రం కరపత్రాలు, జపమాలలు, బ్యానర్లు, జెండాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు పంపండం జరగిదన్నారు. మొదటి సంవత్సరమే లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు, ఈ కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీరామదీక్ష కార్యక్రమంలో భాగంగా 4 ఏప్రిల్ నాడు శ్రీరామ జన్మస్థానమైన ఆయోధ్యలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని మహా విద్యాపీఠం, ధర్మ జాగరణ సమితి ఆధ్వరంలో గణంగా నిర్వహించనున్నారు.
శ్రీ శార్వరి నామ సంవత్సర చైత్ర శుద్ద పాఢ్యమి నుండి ఏప్రిల్ 2 వరకూ తోమ్మిది రోజుల పాటు ఈ ధిక్షను చెపడుతున్నామని తెలిపారు. అదే విధంగా దీక్షాకాలంలో ఉభయ సంధ్యల్లో స్నానం ఆచరించి దీపారాధన చేసి శ్రీరామ రక్షాస్తోత్రం పఠనం చేసిన చేయాలన్నారు.