ఆదివారం(జూన్ 21న) రోజు సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ఉదయం 10.25 నిమిషాల నుండి మధ్యాహ్నం 1.54 గంటల వరకూ ఉంటుంది. ఈ సందర్భంగా జ్యోతిష పండితులు కొన్ని విషయాలు వెల్లడించారు. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకుంటేనే మంచిదని చెబుతున్నారు.
ఇక అలానే ఈ గ్రహణంను వృషభ, మిధున రాశుల వారు చూడకుండా ఉండాలని సూచిస్తున్నారు. జన్మ నక్షత్రాల పరంగా మృగశిర, ఆరుధ్ర, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈ గ్రహణం కీడును కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇక ఈ గ్రహణం సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలు మూతబడనున్నాయి.
బాసర సరస్వతీ దేవాలయం, శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకూ మూతబడనుంది. అలానే ఈ సూర్య గ్రహణం సమయంలో విజయవాడ, తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట తదితర పుణ్యక్షేత్రాల్లోని ఆలయాలను కూడా మూసివేయనున్నారు. ఇక ఇదే సమయంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరగనున్నాయి.
అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?